Dharmapuri | ధర్మారం, ఆగస్టు 27 : ధర్మారం మండలం కొత్తూరు గ్రామ యువ మహిళా సర్పంచ్ భూక్య సంగీత ఆంజనేయులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సంయుక్తంగా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడం, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి లో భాగంగా వారు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యా బోధన, విద్యార్థుల హాజరు వివరాలను ఉపాధ్యాయులను సర్పంచ్ సంగీత ఆంజనేయులు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు ప్రణాళిక ద్వారా ప్రకారం నాణ్యమైన విద్యాబోధన చేసి పాఠశాలలకు ఉన్నత శ్రేణి ఖ్యాతిని నిలబెట్టాలని ఈ సందర్భంగా సర్పంచ్ ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం సర్పంచ్ తో పాటు పాలకవర్గ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజనం నాణ్యతను పరిశీలించారు. పాఠశాలల్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని, అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని సర్పంచ్ సంగీత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సామల నాగభూషణం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.