కార్పొరేషన్, జనవరి 30: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఎన్నికల ధ్యాసే తప్ప, అభివృద్ధి పట్టదని నగర మేయర్ వై సునీల్రావు నిప్పులు చెరిగారు. దుష్ప్రచారం..రెచ్చగొట్టడం త ప్పా చేసిందేంలేదని విరుచుకుపడ్డారు. సోమవా రం ఓ ప్రైవేట్ ఫంక్ష న్హాల్లో విలేకరులతో మా ట్లాడారు. సంజయ్ పార్లమెంట్ సభ్యుడిననే సోయిలేకుండా ఇష్టారీతిన మా ట్లాడుతున్నాడని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత విద్యుత్ ఇస్తున్నారా? రైతుబంధు ఇస్తున్నారా? రైతు బీమా అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. సంజయ్కు సాగునీటి రంగంపై అసలే అవగాహన లేదని ఎద్దేవా చేశారు. గతంలో 16 టీఎంసీలకు డిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును 160 టీఎంసీలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. ఇల్లు నిర్మాణం చేయాలంటే ఏం డ్లు పడుతున్న సమయంలో కేవలం 3 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఎండాకాలంలో కూడా చెరువులను మత్తడి దుంకించేలా చేసిన ఘనత కేసీఆర్ది అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆవాసానికి మిషన్ భగీరథ నీరు అందిస్తున్నదని చెప్పారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా కళ్లుండి చూడలేని దుస్థితిలో బండి ఉన్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ఆర్ఐ పాలసీ లేదని వ్యాఖ్యలు చేస్తున్న ఆయన, అసలు ఎన్ఆర్ఐ శాఖ ఎవరి ఆధీనంలో ఉంటుందో అవగాహన ఉందా అని ప్ర శ్నించారు. ఎంత సేపు ఎన్నికల ధ్యాసే తప్పా సంక్షేమం గు రించి ఆలోచించడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రపాద్ పథకంలో కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాలను ఎందుకు చేర్చలేదు? ఒక్క రూపాయైనా తెచ్చావా..? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ వేములవాడ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సుందరీకరణ పనులు చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిని విస్మరిస్తున్న సంజయ్కు ప్రజలు రాబోయే రోజులో తగిన బుద్ధ్ది చెబు తారని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు గంట కళ్యాణి, గుగ్గిళ్ల జయశ్రీ, చాడగోండ బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, వాల రమణారావు, ఎదుర్ల రాజశేఖర్, నేతలు సుధగోని కృష్ణాగౌడ్, ఎడ్ల అశోక్, గంట శ్రీనివాస్, కరీం, అనిల్, ధన్రాజ్, బాలు పాల్గొన్నారు.