కార్పొరేషన్, జనవరి 13: నగరంలోని అంబేదర్ స్టేడియంలో గల ఇండోర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 21న విద్యార్థులకు స్వచ్ఛత పోటీలు నిర్వహిస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. స్థానిక భగత్నగర్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్తో కలిసి పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిషరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, బల్దియా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల కోసం స్వచ్ఛత పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నగర స్వచ్ఛత అంశంపై వ్యాసరచన, చిత్రలేఖనం, లఘుచిత్రం, నాటక ప్రదర్శన పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి రూ.3 వేలు అందిస్తామన్నారు. విద్యార్థులు ఈ నెల 18 వరకు ఈ మెయిల్ ఐడీ knrcmnr@ rediffmail.comకి వివరాలు పంపి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా షార్ట్ ఫిలిం పోటీల్లో పాల్గొనే వారు లఘు చిత్రాన్ని చిత్రీకరించి 21న ప్రదర్శించాలన్నారు. వివరాలకు సెల్ నంబర్ 9849907544లో సంప్రదించాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ త్రియంభకేశ్వర్, శానిటేషన్ సూపర్వైజర్ రాజమనోహర్ పాల్గొన్నారు.