తెలంగాణచౌక్, మార్చి 30: పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తీపికబురందించింది. పరీక్షల వేళ ప్రయాణానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. బస్సు కండక్టర్కు హాల్ టికెట్ చూపి సెంటర్ వరకు టికెట్ లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉత్వర్వులు జారీ చేశారు. పది పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఉదయం 8 గంటల నుంచి సా యంత్రం 4 వరకు బస్సుల్లో ప్రయాణించవచ్చు. అయితే బస్ పాస్ ఉన్న విద్యార్థులకే ఈ సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పరీక్ష సమయానికి గంట ముందు చేరుకునేలా బస్సులను నడుపనున్నారు. సమాచారం కోసం బస్టాండ్లలో హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. పర్యవేక్షణ బాధ్యతలను డిపో మేనేజర్లకు అప్పగించారు. వీరి ఫోన్ నంబర్లను సైతం అందుబాటులో ఉంచారు.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ఆదేశాల మేరకు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే వి ద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. పరీక్షల సమయంలో సెంటర్లకు బస్సులను నడుపుతాం. బస్సు పాసు చూపిన వారికే అనుమ తి ఉంటుంది. పర్యవేక్షణ బాధ్యతలను డిపో మేనేజర్లకు అప్పగించాం. విద్యార్థులు ఉచిత సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ఖుస్రోషా ఖాన్, ఆర్టీసీ ఆర్ఎం
ప్రభుత్వ నిర్ణయం సంతోషకరం
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌ కర్యం కల్పించడం అభినందనీయం. విద్యార్థులు ఎలాం టి ఒత్తిడిలేకుండా పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవద్దు. ఈ అవకాశాన్ని వినియోగించాలి. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న సర్కారుకు విద్యార్థులు, తల్లిదండ్రుల తరుఫున కృతజ్ఞతలు.
-మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు