 
                                                            Tahsildar Srinivas Reddy | తిమ్మాపూర్,అక్టోబర్31: మొంథా తుపాన్ వల్ల నష్ట పోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి, బీజేపీ నాయకుల తో శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల తాకిడికి నష్టపోయిన వరి తో పాటుగా ఆరుతడి పంటలు, కూరగాయ పంటలకు కూడా పూర్తి స్థాయిలో నష్టం జరిగినందున ఆయా రైతులకు సంబందించిన పూర్తి వివరాలు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించాలని తహసీల్దార్ ను కోరారు.
ఇంకా ప్రారంభం కానీ చోట కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంబించాలని కోరారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తుఫాన్ తాకిడికి నష్టపోయిన పంటలకే కాకుండా పశు నష్టం, ఆస్తి నష్టం జరిగిన వారికి కూడా పరిహారం అందివ్వాలని కోరారు. గతంలో కూడా నష్టపరిహారం ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారని, మళ్లీ అలాంటి మోసం చేయవద్దని వేడుకున్నారు. రూ.30వేల పైగా పెట్టుబడి పెట్టిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రభుత్వమిచ్చిన హామీ ఎటూ సరిపోదని రూ.50 వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నష్ట పోయిన రైతాంగాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. మండలంలో జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నష్టపరిహారం వెంటనే అందేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్, చింతం శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఎడ్ల జోగిరెడ్డి, మూడం శ్రీలత, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు, తాళ్లపెల్లి రాజు, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, వేల్పుల ఓదయ్య, ఉప్పులేటి జీవన్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, కోతి రాజు, దుర్గుంటి శేఖర్ రెడ్డి, ఎడ్ల భూం రెడ్డి, సిద్ద శ్రీనివాస్, రేగూరి సుగుణాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
                            