ధర్మపురి, డిసెంబర్ 1: మత్స్య సంపదలో మనమే ముందున్నామని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ ఫిష్ హబ్గా మారిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మత్స్య సమీకృత అభివృద్ధి పథకం కింద గురువారం ధర్మపురి పట్టణంలో గోదావరి ఎల్లంపల్లి బ్యాక్ వాటర్లో 2 లక్షల 77 వేల చేప పిల్లలను విడుదల చేసి, మాట్లాడారు. రాష్ట్రంలో నీలి విప్లవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా 100 శాతం చేప పిల్లలను ఉచితంగా అందజేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఘనత ఆయనకే దక్కుతుందని చె ప్పారు. గోదావరి నదిలో కాళేశ్వరం నుంచి ధర్మపురి దాకా 200 కిలోమీటర్ల మేర పుష్కలంగా ఉన్న నీటిలో మత్స్య సంపద భారీగా పెరిగిందన్నారు. దీంతో స్థానికంగా ఉన్న గంగపుత్రులతో పాటు అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉ పాధి దొరుకుతున్నదని చెప్పారు. ఇక్కడ డీసీఎమ్మె స్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యో రి రాజేశం, వైస్ చైర్మన్ సునీల్ కుమార్, నాయకులు సంగి శేఖర్, సాంబమూర్తి, వెంకటేశ్వరరావు తదితరులున్నారు.
పెగడపల్లి, డిసెంబర్ 1: మండల కేంద్రంలో నిర్మించే మండల పద్మశాలీ సంఘ భవనానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ రూ.10 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు గురువారం ప్రొసీడింగ్ కాపీని మంత్రి కరీంనగర్లోని క్యాంపు కార్యాలయంలో పద్మశాలీ సంఘ నాయకులకు అందజేశారు. ఆ సంఘం నాయకులు మంత్రి ఈశ్వర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆరవల్లి సర్పంచ్ ఉప్పలంచ లక్ష్మ ణ్, నాయకులు సిరిపురం మల్లేశం, కురిక్యాల శంకరయ్య, జడల వెంకటేశం, బోగ గోపికృష్ణ, జుంజురు రాజమల్లు, బోగ గంగాధర్, మహేశుని శంకరయ్య, గాలిపెల్లి సత్తయ్య, రంజిత్కుమార్, శోభన్బాబు, బద్రి, మల్లేశం, నారాయణ, లక్ష్మీరాజం, రమేశ్ పాల్గొన్నారు.
వెల్గటూర్, డిసెంబర్ 1: కిషన్రావుపేటకు చెం దిన టీ(బీ)ఆర్ఎస్ సీనియర్ నాయకుడు పులి రాయనర్సు కూతురు వివాహానికి గురువారం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, సర్పంచులు మేర్గు కొముర య్య, కొప్పుల సాగర్, పార్టీ మండలాధ్యక్షులు చ ల్లూరి రాంచందర్ గౌడ్, సింహాచలం జగన్, బీసీ సెల్ మండలాధ్యక్షుడు కుమ్మరి వెంకటేశ్, నాయకులు బొడ్డు రామస్వామి, బోగె రాజయ్య, పడి దం వెంకటేశ్, సత్తయ్య, లచ్చయ్య పాల్గొన్నారు.