Vemulawada | వేములవాడ, జూన్ 9: వేములవాడ రాజన్న ఆలయంలోని పలు ఉద్యోగాలకు మంగళవారం నియామక పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ నియామకానికి కమిటీని నియమిస్తూ జీవోను ఉత్తరాలు జారీ చేశారు. అయితే రాజన్న ఆలయంలో వైష్ణవర్చక 2, తమ్మల అర్చక 2, బ్రాహ్మణ పరిచారిక 11, డోలు, సన్నాయి 5, బ్రాహ్మణ వంట మనిషి 1, తో కలిపి మొత్తం 21 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఇందులో వైష్ణవ పరిచారికకు 7, తమ్మల పరిచారకకు 7, బ్రాహ్మణ పరిచారకకు 47, బ్రాహ్మణ వంట మనిషి ఉద్యోగానికి 5, డోలు 32, సన్నాయి, 22, శృతి 35 లతో కలిసి 155 మంది దరఖాస్తు చేసుకొని పరీక్షలకు హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ వ్రాత, పరీక్ష, మౌఖికంగా, పరీక్షలను నిర్వహించారు. హైదరాబాదులోని తుల్జా భవన్ ఈ ఉద్యోగ నియామకాలకు అధికారులు పరీక్షలు నిర్వహించగా వేములవాడ రాజన్న ఆలయ యువ రమాదేవితో పాటు పరిపాలన అధికారులు అక్కడికి వెళ్లి పర్యవేక్షించారు.