రాజన్న సిరిసిల్ల, మే 31: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి సహకారం అందిస్తాం అని నవతేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చైర్మన్ గండ్ర యాదగిరి రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మాణం చేశారని, ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు. కోరుట్లపేట గ్రామశాఖ అధ్యక్షుడు లోకుర్తి బాలమల్లు, ఆలయ నిర్వాహకులు చిదుగు గోవర్ధన్ గౌడ్, సర్పంచ్ ఇల్లేందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, ప్రేమ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.