HomeKarimnagarThe Telangana Decade Celebrations People Across The District Paid Their Respects To The Martyrs On The Last Day 2
త్యాగధనులకు వందనం
నివాళులర్పించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రమేశ్బాబు, రసమయి, జడ్పీ చైర్పర్సన్ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమరులకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘన నివాళులర్పించారు.
ఘనంగా అమరుల సంస్మరణ దినం
జిల్లావ్యాప్తంగా ఘన నివాళి
కుటుంబ సభ్యులకు సన్మానం
త్యాగాలను స్మరించుకుని భావోద్వేగం
ప్రాణత్యాగంతోనే స్వరాష్ట్రం సాకారమని వెల్లడి
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంస్మరణ ర్యాలీ
నివాళులర్పించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రమేశ్బాబు, రసమయి, జడ్పీ చైర్పర్సన్ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమరులకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘన నివాళులర్పించారు. స్మారక స్తూపాలను పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన త్యాగధనులకు సలాం చేస్తూ స్మరించుకున్నారు. జడ్పీ, మున్సిపల్, పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. వారి ప్రాణత్యాగంతోనే స్వరాష్ట్ర కల సాకారమైందని గుర్తు చేశారు. కాగా, జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పాల్గొని తెలంగాణ అమరులకు నివాళులర్పిచారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సాయంత్రం అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
– రాజన్న సిరిసిల్ల, జూన్ 22 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం అమరులకు జిల్లా ప్రజలు ఘన నివాళులర్పించారు. పల్లె, పట్టణాల్లో తెలంగాణ అమర వీరుల స్తూపాలను ముందు రోజే పూలతో అందంగా అలంకరించారు. గురువారం ఉదయం అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమ కారులు, జేఏసీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున స్తూపాల వద్దకు చేరుకొని పూలు చల్లి నివాళులర్పించారు. ‘తెలంగాణ అమరులకు జోహార్’ అంటూ నినదించారు. జిల్లా పరిషత్, మున్సిపల్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, అమర వీరుల సంస్మరణ తీర్మానం ప్రవేశపెట్టారు. అమరుల కుటుంబ సభ్యులను సన్మానించి, భావోద్వేగానికి లోనయ్యారు. వారి ప్రాణత్యాగాలు వెలకట్టలేనివని, అమరుల త్యాగం వల్లే స్వరాష్ట్రం సాకారమైందని స్పష్టం చేశారు. కాగా, జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, వైస్చైర్మన్ సిద్ధం వేణు, సీఈవో గౌతంరెడ్డి అమరులకు నివాళులర్పించి మౌనం పాటించారు.
అనంతరం అమరవీరుల సంస్మరణ తీర్మానం ప్రవేశపెట్టారు. పాతబస్టాండ్లోని అమర వీరుల స్తూపం వద్ద రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ చైర్మన్ గడ్డం నర్సయ్య నివాళులర్పించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సాయంత్ర జిల్లా కేంద్రంలో అమరవీరుల సంస్మరణ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి పాతబస్టాండ్లోని అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. వేములవాడ పట్టణంలో ఎమ్మెల్యే చెన్నమేని రమేశ్బాబు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, తంగళ్లపల్లి మండలంలో ఎంపీపీ మానస, బోయినపల్లి మండలంలో ఎంపీపీ వేణుగోపాల్, రుద్రంగిలో గట్ల మీనయ్య, కోనరావుపేటలో ఎంపీపీ చంద్ర య్య, ముస్తాబాద్లో ఎంపీపీ జనగామ శరత్రావు, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు గోపాల్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సురేందర్రావు, ఎల్లారెడ్డిపేటలో ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, వీర్నపల్లి ఎంపీపీ మాలోతు భూల, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.