BRS | రాజన్న సిరిసిల్ల వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ ఉపసర్పంచ్ బెజగం మహేశ్, పదో వార్డు సభ్యులు బాణాల రాజు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. వారికి నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన రుద్రవరం ఉప సర్పంచ్ బెజగం మహేశ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి చల్మెడతోనే జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, వార్డు సభ్యులు అలిపిరి సురేశ్, గ్రామ శాఖ అధ్యక్షుడు హరికృష్ణ, సీనియర్ నాయకులు కట్ట తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు.