రాజన్న సిరిసిల్ల : టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
మరోసారి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మనోజ్ కుమార్, మునీర్, వరుణ్, కిరణ్, సికిందర్, అఫ్రోజ్, చోటు, యాదగిరి, తదితరులు ఉన్నారు.