ముమ్మరంగా ఆస్తి పన్నుల వసూలు
ఇప్పటికే 95శాతం పూర్తి
ఇంటింటికీ తిరిగి సేకరణ.. ఆన్లైన్లోనూ స్వీకరణ
సిరిసిల్ల టౌన్, మార్చి 29: ఆస్తిపన్ను వసూళ్లలో సిరిసిల్ల మున్సిపల్ అధికారులు లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ఈ నెల 31తో గడువు ముగుస్తుండడంతో పన్నుల వసూళ్లలో వేగం పెంచారు. ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటికీ తిరుగుతూ వంద శాతం వసూలుకు కృషి చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో 4.34కోట్లు లక్ష్యం కాగా, ఆన్లైన్లోనూ చెల్లించేలా అవకాశం కల్పించడంతో ఇప్పటి వరకు 95శాతం పన్నులు వసూలు చేశారు.
సిరిసిల్ల పట్టణంతోపాటు అర్బన్ గ్రామాలను కలుపుకొని మున్సిపల్కు 4.34కోట్ల ఆస్తి పన్ను బకాయిలున్నాయి. కమిషనర్ సమ్మయ్య, సభ్యు ల సహకారంతో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పన్ను లు వసూలు చేస్తున్నారు. అపరాధ రుసుములో 90శాతం రద్దు చేయడంతో బకాయిదారులు పన్నులు చెల్లించేందుకు ముందుకువస్తున్నారు. 15వేలలోపు ఉన్నవారికి 50శాతం రాయితీని ప్రకటించడంతో పూర్తి స్థాయిలో చెల్లిస్తున్నారు.
పక్కా ప్రణాళికతో..
అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో లక్ష్యానికి చేరువైంది. వడ్డీ మాఫీ ఆఫర్పై మున్సిపల్ సిబ్బంది మైక్, పత్రిక ప్రకటనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో, ఆన్లైన్ (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం)లోనూ పన్నులు స్వీకరించారు. దీంతో ఇప్పటివరకు రూ.4.15కోట్లు వసూలు చేశారు. ఇప్పటికే 2, 3, 5, 7, 9, 13, 14, 22, 25, 30, 34, 35, 36, 37 వార్డుల్లో వందశాతం ఆస్తి పన్ను వసూలుకు సహకరించిన కౌన్సిలర్లతోపాటు బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులను ప్రజాప్రతినిధులు మున్సిపల్ కార్యాలయంలో సన్మానించారు.
ఇవి కూడా చదవండి
ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ : పాన్ ఇండియన్ స్టార్గా ప్రమోషన్
ఆ సినిమా కోసం చిరంజీవి వెయిటింగ్.. కారణం ఇదే