రాజన్న సిరిసిల్ల : వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం మామిడిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చెక్కపల్లి భిక్షపతి (41) అనే వ్యక్తి కోనరావుపేట నుంచి మామిడిపల్లికి బతుకుదెరువు కోసం వచ్చాడు. ఉదయాన్నే కూలిపనికి వెళ్లి ఇంటికి వచ్చి ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు. మృతుడికి భార్య గౌరవ్వ, కొడుకు వేణు, కూతురు రిష్మా ఏన్నారు. నిరుపేద బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.