చేవెళ్లటౌన్, ఫిబ్రవరి,21 : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి అన్ని విధులగా కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి కోసం ఎమ్మెల్యే , టీఆర్ఎస్ పార్టీ నాయకులు చింటు, కృష్ణారెడ్డి, శంకర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకారపు మహేష్ చారి కలిసి రూ. 5లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు.
దేవాలయల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణలో దేవాలయలు అభివృద్ధి చెందాయన్నారు. రెండో తిరుపతిగా పేరుగాంచిన చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకవస్తానాన్ని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు వచ్చే భక్తులకు ఎటు వంటిలోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని పూజారులకు సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మెన్ మాణిక్యరెడ్డి, కృష్ణ కాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.