ఎల్లారెడ్డిపేట, జూలై 29 : అన్ని ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణాల నిర్వాహకులు ఈ పాస్ యంత్రాలతో దుకాణాల్లో నిల్వలను సరిగా చూసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఫర్టిలైజర్ యజమానులకు సూచించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణాలు, మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం, గొల్లపల్లిలో శ్రీ సాయినాథ్, బొప్పాపూర్ రోడ్ లోని శ్రీ మహేశ్వర ఆగ్రో ఏజెన్సీ ఫర్టిలైజర్స్అండ్ పెస్టిసైడ్స్సీడ్స్దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు.
దుకాణాల్లోని రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో తేడాలు ఉండటంతో ఇకముందు స్టాకులో తేడా ఉండకుండా చూడాలని ఆదేశించారు. అలాగే పురుగు మందుల శాంపుల్స్ను పరీక్ష చేయాలని అధికారులకు సూచించారువర్షాల నేపథ్యంలో రైతులకు ఎరువులు, ఇతర సామగ్రి విషయంలో ఇబ్బందులు రాకుండా చూడాలని, ఎరువులు, విత్తనాలు విక్రయాలు నిబంధనల ప్రకారం నాణ్యమైనవి విక్రయించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారి అప్జల్ బేగం, సిబ్బంది ఉన్నారు.