రాజన్న సిరిసిల్ల, మే 15 (నమస్తే తెలంగాణ): పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ధారుణమని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య (Thota Agaiah) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోలు ధరలను లీటరు రూ.3 పెంచపడంపై తీవ్రంగా ఖండింస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పెట్రోలు, డీజీలు ధరలు పెంచడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలు, చిరు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. సామాన్యుల నడ్డి విరిచేలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని కేంద్రంపై ఆయన మండిపడ్డారు. మోడీ అచ్చే దిన్ అని చెప్పి అన్ని ధరలు పెంచుతున్నారని, ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగయ్య మండిపడ్డారు.

ఓవైపు ధరలు పెంచుతూనే.. ప్రధాని పొదుపు మంత్రం చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికే పచ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో నిత్యవసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయని, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులను కేంద్రం కోలుకోలేని దెబ్బ తీసిందని ఆయన ధ్వజమెత్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని.. ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనలో అన్నింటా
విఫలమయ్యారని అంజయ్య విమర్శించారు. డీజిల్, పెట్రోల్పై పెంచిన రూ.3ను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు,
నిరసనలు చేపడుతామని అంజయ్య హెచ్చరించారు.