రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ మండలం మరుపాక నంది కమాన్ వద్ద ముంపు గ్రామాల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్ర పటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. మధ్యమానేరు జలాశయంలొ వెయ్యి కోట్ల పెట్టుబడులతో ఐదు వేల మందికి ఉపాధి కల్పన ఇచ్చే చేపల పరిశ్రమను సాధించిన మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిశ్రమతో మత్య్సకారుల జీవితాల్లో కొత్త వెలుగులు పూస్తాయన్నారు.