వేములవాడ : ఎల్ఐసీ పాలసీ వినియోగదారులపై పడుతున్న జీఎస్టీ భారాన్ని తగ్గించాలని కోరుతూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ఏజెంట్లు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
పాలసీదారులు తీసుకున్న రుణాలపై ఉన్న వడ్డీని తగ్గించి, జీఎస్టీ భారాన్ని కూడా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ ఏజెంట్లను కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎల్ఐసీ ఏజెంట్లు ఏముల శ్రీనివాస్, బుర్ర దశ గౌడ్, రాజూరి సత్తయ్య, గజవాడ శ్రీనివాస్, పెంట రాజేందర్, పత్తిపాక శ్రీనివాస్, దొంతుల ప్రభాకర్, అశోక్, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.