కరీంనగర్ రూరల్, జూలై 5: తెలంగాణ సర్కారు విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్గా మారిందని, దేశంలోని ఇతర రాష్ర్టాలన్నీ మన వైపే చూస్తున్నాయన్నారు. ‘మన ఊరు -మన బడి’తో ఎవరూ ఊహించనంతగా పాఠశాలల్లో మార్పులు జరిగాయని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. బుధవారం కరీంనగర్ మండలం నగునూర్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో ‘చైత్ర ది బిగినింగ్’ సంచికను ఆవిష్కరించారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. ప్రభుత్వం గురుకులాల్లో చదువుతున్న విద్యార్థిపై ఏడాదికి 1.20లక్షలు ఖర్చుచేస్తున్నదని చెప్పారు. నాటి పాలకుల నిర్లక్ష్యం, వసతుల లేమితో కుదేలైన విద్యారంగం సీఎం కేసీఆర్ నిర్ణయాలతో బలోపేతమైందన్నారు.నాటి ఉమ్మడి రాష్ట్రంలో గురుకులాలు పేరుకు మాత్రమే ఉండేవని, అప్పుడు పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకు రాలేదన్నారు.
స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ చొరవతో గురుకులాలకు మహర్దశ పట్టిందని, ఇప్పడు అడ్మిషన్లు దొరకని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 298 గురుకులాలు ఉంటే, వాటిని 1030కి పెంచుకున్నట్లు వివరించారు. అంతకుముందు సాంస్కృతిక ప్రదర్శనలు, మాక్ అసెంబ్లీ ప్రోగ్రాంను మంత్రి తిలకించి, విద్యార్థలను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, గురుకులాల నిర్వహణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీ శ్రీహరి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీ సమత, ఎన్ఎస్ఎస్ పీవో డాక్టర్ కే లావణ్య, మ్యాగజైన్ కమిటీ సభ్యులు డాక్టర్ ఎస్ సుష్మ, వీ రోజా రమణి, డీ లలిత, అశ్విని, సీహెచ్ కవిత, డాక్టర్ కే సుహాసిని, కే గీతారాణి, డీ అరుంధతి, జీ సాయికిరణ్, కే మంజుల అధ్యాపకులు పాల్గొన్నారు.