Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, మార్చి26 : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఎంఈవో సిరిమల్ల మహేశ్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ అన్నారు. ఇన్ఫినిటీ ఫిన్కార్న్ సొల్యూషన్ సంస్థ పెద్దపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో బ్రాంచ్ సేల్స్ మేనేజర్ నూనే ప్రశాంత్ మండలంలోని ఇద్దులాపూర్ ప్రభుత్వ పాఠశాలకు రూ.2లక్షల విలు చేసే విద్యా సామగ్రి అందించి, పాఠశాలకు కలర్ వేయించారు. అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు, పలకలు అందించడంతో పాటు, గ్రామంలో తల్లిండ్రుల్ని కోల్పోయిన ఇద్దరు విద్యార్థినులు అక్కల, అక్షిత, అక్షయలకు బట్టలు అదజేశారు.
ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. పుట్టిన ఊరికి, చదివిన పాఠశాలకు తనవంతు సహకారంతో సంస్థ తరపున విద్యా సామగ్రి అందించిన ప్రశాంత్ ను పలువురు అభినందించి శాలువాతో సత్కరించారు. దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సామగ్రి అందించాలని కోరారు. ఇదే సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కొనియాడారు. సంస్థ సీఈవో శ్రీకాంత్ రవాల్కర్, హెడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ శంకర్ మాస్లే, ఏరియా మేనేజర్ మానుపాటి భీం రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి లత, హెచ్ఎం దాస్, కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటేశ్, సీఆర్పీ కుమారస్వామి, ఉప సర్పంచ్ హరీశ్, సంస్థ ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్ శారద, ఆయ త్రివేణి, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.