హుజూరాబాద్టౌన్, డిసెంబర్ 2: ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం సాయంత్రం హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 1 నుంచి 15 వార్డుల టీ(బీ)ఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పట్టణంలోని పార్టీ ఆఫీసులో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకువెళ్లాలని సూచించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో టీఆర్ఎస్ గులాబీ జెండా రెపరెపలాడాలన్నారు. అందుకు ఇప్పటి నుంచే కంకణ బద్ధులై పని చేయాలని, శాసన సభ టికెట్ తనకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, అందుకు ఇప్పటి నుంచే తాను కూడా ప్రజల బాగోగుల్లో భాగస్వామినవుతానని పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్సీగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఆయనతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల, టీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణాధ్యక్షులు సంగెం అయిలయ, కొలిపాక శ్రీనివాస్, 15 మంది వార్డుల కౌన్సిలర్లు, టీ(బీ)ఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 2: అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి ముందుగా గ్రామంలోని వీధుల్లో పర్యటించారు. దళిత వాడలో దళిత బంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న డెయిరీ ఫాంలను సందర్శించారు. అనంతరం ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారించారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడూరి ప్రతాప్రెడ్డి, ఎంపీటీసీ రాజేశ్వర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుగుణాకర్రెడ్డి, తహసీల్దార్ కోమల్రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి సహకారం
హుజూరాబాద్టౌన్, డిసెంబర్ 2: ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధి కోసం సాయం చేస్తూ సహకరిస్తున్నారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేరొన్నారు. శుక్రవారం హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ, శ్రీనాగేంద్రస్వామి దేవాలయాల వద్ద దర్వాజ ప్రతిష్ఠ కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. ప్రత్యేక పూజలు చేశారు.
ఆయా కార్యక్రమాల్లో మాజీ సర్పంచ్ వేముగంటి రవీందర్రావు-జానకీదేవి, హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక-శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల-శ్రీనివాస్, కౌన్సిలర్లు తొగరు సదానందం, తాళ్లపల్లి శ్రీనివాస్, ఎంపీపీ ఇరుమల్ల రాణి-సురేందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్కుమార్, పింగిళి రమేశ్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గంట శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు గంట రమేశ్, ఉపాధ్యక్షుడు గంట సమ్మయ్య, కార్యదర్శి గంట శ్రీనివాస్, సభ్యులు గంట శంకర్, గంట ప్రశాంత్, గంట రవీందర్, గంట కనకయ్య, గంట సమ్మయ్య, దండవీణ తిరుపతి, గ్రామ పెద్దలు దొంత రమేశ్, మాసాడి ముత్యంరావు, మాసాడి సమ్మారావు, సంపత్రావు, జలగం ప్రభాకర్రావు, రవీందర్రావు, అంగిరక ప్రసాద్, పోతరవేణి అనిల్కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు.