గంగాధర, నవంబర్ 13: బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని, ప్రతి గడపనూ తట్టి ఓట్లు అభ్యర్థించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరించాలని, అసత్య ప్రచారాలను ఎండగట్టాలని సూచించారు. ఈనెల 17న చొప్పదండిలో సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. గంగాధర మండలం కురిక్యాల శుభమస్తు ఫంక్షన్హాల్లో సోమవా రం ఏర్పాటు చేసిన గంగాధర, బోయినిపల్లి మండలాలకు చెందిన బూత్ కమిటీ ఇన్చార్జిల సమావేశానికి చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి వినోద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గులాబీ అభ్యర్థి విజయం కోసం దిశానిర్దేశం చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, వంద ఓట్ల ఇన్చార్జులు గ్రామాల్లోనే ఉం డాలని, సైనికుల్లా పనిచేయాలని సూచించారు.
23 ఏండ్ల కింద తెలంగాణ ఎట్లుండె.. ఇప్పుడు ఎట్లున్నదో ప్రజలకు వివరించాలని, ఆనాడు రై తు ఆత్మహత్యలు, ఆకలి చావులు, ఎన్కౌంటర్లు.. నేడు స్వరాష్ట్రంలో పచ్చగా మారిన తెలంగాణ గురించి చర్చించాలని మార్గదర్శనం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆ పార్టీ తుక్కు కింద ఓడిపోవడం ఖాయమని చెప్పారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు. అనంతరం చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా గంగాధర మండలం నుంచి 12 వేల మందిని, బోయినపల్లి మండలం నుంచి 7 వేల మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గంగాధర మండలంలో 64 బూత్లు, బోయినపల్లి మండలంలో 40 బూత్లు ఉన్నట్లు తెలిపారు. గతంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలని, ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్నారు. చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దానని చెప్పారు. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, ఎంపీపీలు శ్రీరాం మధుకర్, పర్లపెల్లి వేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలగౌడ్, వెలిచాల తిర్మల్రావు, పార్టీ మండలాధ్యక్షులు మేచినేని నవీన్రావు, కత్తెరపాక కొండయ్య, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, కంకణాల విజేందర్రెడ్డి, వేముల దామోదర్, వేముల అంజి, రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, ఆకుల శంకరయ్య, రాసూరి మల్లేశం, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, కోలపురం లక్ష్మణ్, దూలం శంకర్గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో 30 మంది చేరిక
రామడుగు మండలం షానగర్లోని లక్ష్మి గార్డెన్లో జరిగిన బూత్కమిటీల సమావేశంలో 30 మంది బీఆర్ఎస్లో చేరారు. షానగర్కు చెందిన శివ గణేష్ యూత్ సభ్యులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ సమక్షంలో సుమారు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీలు చిలుక రవీందర్, కలిగేటి కవిత- లక్ష్మణ్, జడ్పీటీసీలు మాచర్ల సౌజన్య-వినయ్, మారొండ లక్ష్మి -కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ-భూమారెడ్డి, మారెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుకారెడ్డి, మామిడి తిరుపతి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, సింగిల్ విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, ఒంటెల మురళీకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య, మాజీ ఎంపీపీలు వల్లాల కృష్ణ హరి, టౌటు మురళి, సర్పంచులు కరుణాకర్, అమరేందర్ రెడ్డి, అజయ్, శేఖర్ రెడ్డి, గుంట రవి, వెల్మ నాగిరెడ్డి, దామెర విద్యాసాగర్ రెడ్డి, గుడిపాక సురేష్, పెద్ది శంకర్, లింగంపల్లి లావణ్య,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, వెల్మ శ్రీనివాస్ రెడ్డి నాయకులు కరుణాకర్, గుండి ప్రవీణ్ ,నేరెళ్ల అంజయ్య, పూడూరు మల్లేశం, లంక లక్ష్మణ్, ప్రశాంత్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు స్వామి రెడ్డి, గాండ్ల లక్ష్మణ్ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.