Chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 28 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పది రోజులు గడిచినప్పటికీ కేంద్రాలలో కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో ‘రైతన్న నెత్తిన ట్రక్ షీట్.. ధాన్యం కాంటాకు కొర్రీల తంట’ అంటూ ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింది. ఈ కథనానికి అధికారులు స్పందించారు. చిగురు మామిడి మండలంలోని చిగురుమామిడి బొమ్మనపల్లి సుందరగిరి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) బీ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా కేంద్రాలను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. కేంద్రాలలో నిలువ ఉన్న ధాన్యం నిలువలను వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహలను ఆదేశించారు.
కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని వారికి సూచించారు. రైతుల ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో నిల్వ ఉండకూడదని సూచించారు. వర్షాలు పడితే రైతుల ధాన్యం తడవకుండా టర్పాలిన్లు సెంటర్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున రైతులు ఉండేందుకు నీడ వసతి తో పాటు త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ట్రాక్టర్లలో తరలించిన ధాన్యాన్ని ఇబ్బందులు లేకుండా మిల్లర్లతో మాట్లాడతారని అన్నారు. వీరి వెంట తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఏపీఎం శ్రీనివాస్, సీసీలు రవీందర్, సత్యనారాయణ, సెంటర్ నిర్వాహకులు ఉన్నారు. చిగురుమామిడి మండలంలోని అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభం కావడం పట్ల రైతులు వ్యక్తం చేశారు.