కార్పొరేషన్, జూలై 7: ఎప్పుడో మంజూరై.. భూసేకరణ కూడా పూర్తయి పనులు మొదలైన జాతీయ రహదారి 563కు ప్రధాని మోదీ ప్రా రంభోత్సవం చేయడం సిగ్గుచేటని నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చురకలంటించారు. శుక్రవారం స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన నాలుగేండ్ల పదవికాలంలో ప్రజలను ప ట్టించుకోలేదని విమర్శించారు. వినోద్కుమార్ ఎంపీగా ఉన్న సమయంలోనే జాతీయ రహదారి 563 మంజూరు, భూ సేకరణ కూడా పూర్తయిందని చెప్పారు.
ఇప్పటికే రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయని తెలిపారు. జాతీయ రహదారిని తానే సాధించినట్లు చెప్పుకుంటూ బండి సంజయ్ ప్రధానితో ప్రారంభోత్సవం చేయించడం ఎంతవరకు సమంజసమ ని ప్రశ్నించారు. ఎంపీగా కరీంనగర్ పార్లమెం ట్ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వ చ్చే నిధులు తప్పా.. ప్రత్యేకంగా బండి సంజ య్ తెచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే వరంగల్ సభలో ప్రధాని మోదీ చేత శామీర్పేట ఫ్లై ఓవర్కు రక్షణ శాఖ భూములు ఇప్పించే విధంగా ప్రకటన చేయించాలని సవాల్ చేశారు. కనీసం కరీంనగర్కు ప్రత్యేక ప్యాకేజీపై ప్రధానితో ప్రకటన చేయించాలన్నారు.
నాలుగేండ్లు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన సంజయ్.. ఇ ప్పుడు పదవి పోగానే ప్రజలు గుర్తు వచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలకు మేలు చేసే పనులు చేపట్టాలని హితవు చెప్పారు. బీజేపీ నిరుద్యోగులను రెచ్చగోట్టి మభ్యపెట్టడం తప్పా చేసిందేంలేదని విమర్శించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న సంజయ్కి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చె ప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వారి పార్టీ నాయకులు బండి సంజయ్పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనేవారు మూర్ఖులు అని విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేస్తుందని, కాని బీజేపీ మాత్రం మతత్తత్వం, వర్గాల వారీగా విడదీసి రెచ్చగొట్టే పార్టీ ఎద్దేవా చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, కంసాల శ్రీనివాస్, గంట కళ్యాణి శ్రీనివాస్, వాల రమణారావు, ఎదుర్లు రాజశేఖర్, గందె మాధవి, నాయకులు అనిల్, నరేందర్, హామీద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.