జగిత్యాల, జనవరి 5 : దివ్యాంగుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శుభమస్తు కన్వెన్షన్లో గురువారం దివ్యాంగుల ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. మాట్లాడుతూ.. దే శంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు రూ. 3వేల పింఛన్ ఇస్తున్నామన్నారు. జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్రూం ఇండ్లలో 200 ఇండ్లు ది వ్యాంగులకు కేటాయించినట్లు చెప్పారు.
దివ్యాంగులను పెండ్లి చేసుకుంటే కళ్యాణలక్ష్మితో పాటు అదనంగా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కొ ప్పుల ఈశ్వర్ సహకారంతో దివ్యాంగులకు త్రీ విల్లర్ స్కూటీలు, మోటరైజ్డ్ ట్రై సైకిళ్లు, ఇతర పరికరాలు అందిస్తున్నట్లు వివరించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరాను తోడుగా చేసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొని, అందరికీ ఆదర్శంగా నిలువాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు, వికలంగులు, యు వతకు రాష్ట్రంలో అందే అన్ని సంక్షేమ పథకాలు దేశంలో కూడా అమలు చేసేందుకే బీఆర్ఎస్ పా ర్టీ ఏర్పాటైందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎమ్మెల్యే సంజయ్ చొరవ ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి ఆయన ఎమ్మె ల్యే అవడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే, ఎంపీని దివ్యాంగులు సన్మానించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ బంధు సత్యం, నాయకులు లంక దాసరి శ్రీనివాస్, అస్గర్ ఖాన్, ప్రవీణ్, సర్పంచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.