‘తమది ప్రజాప్రభుత్వమని, సామాన్యులు సైతం సమస్యల కోసం నేరుగా అధికారులు, మంత్రులను కలవవచ్చని, అవసరమైతే ఆందోళనలు కూడా చేసుకోవచ్చని’ ఊదరగొట్టిన రేవంత్ సర్కారు ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం కొలువుదిరీ ముచ్చటగా మూడు నెలలైనా కాకముందే జులుం ప్రదర్శిస్తున్నది. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జరిగిన ఘటనే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. దళితబంధు రెండో విడుత నిధులు ఇవ్వాలని కలెక్టర్కు విన్నవించడానికి వస్తే గేటులోకి రాకుండానే తమపై పోలీసులు దౌర్జన్యం చేయడంపై దళితలోకం మండిపడుతున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 26: దళితబంధు రెండో విడుత నిధుల ఫ్రీజింగ్ ఎత్తివేయాలని ప్రజావాణిలో విన్నవించేందుకు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్కు వచ్చిన లబ్ధిదారులపై పోలీసులు దాష్టీ కం ప్రదర్శించారు. ఎక్కడివారినక్కడే అడ్డగించి బలవంతంగా పోలీసు వ్యానులు, జీబుల్లోకి నెట్టి, పోలీసు శిక్షణ కళాశాలకు తరలించారు. మహిళలు అని కూడా చూడకుండా లాక్కెళ్లి, వ్యాన్లలోకి ఎక్కించారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై విరుచుకుపడ్డారు.
దీని ని నిరసిస్తూ పలువురు దళితయువకులు కలెక్టరేట్ రోడ్డుపై మెరుపు ధర్నాకు దిగారు. ‘సీఎం రేవంత్ డౌన్.. డౌన్’ అంటూ నినాదాలు చేశారు. సమాచా రం అందుకున్న వన్టౌన్ సీఐ సరిలాల్, పలువురు ఎస్ఐలు, డిస్ట్రిక్ట్ గార్డులు యువకులను బలవంతం గా అదుపులోకి తీసుకున్నారు. దళితబంధు రెండో విడుత నిధుల నిలిపివేతపై కలెక్టర్ను కలిసేందుకు వెళ్తుంటే దుర్మార్గంగా వ్యవహరించడమేంటని నిలదీశారు. మహిళలు శాపనార్థాలు పెట్టా రు.
విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున కార్యాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. దీంతో పదుల సంఖ్య లో ఆందోళనకారులు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. ‘సమస్య జఠిలంగా మారడానికి కారకుడవు నీవే’నంటూ నిలదీశారు. దీంతో, ఆయన ప్రజావాణికి తిరిగి వెళ్లిపోయారు. పదిరోజుల్లో సమ స్య పరిష్కరిస్తానని చెప్పిన సంబంధిత అధికారి నెల గడిచినా విచారణ పూర్తి చేయలేదని ఆరోపించారు. కాగా, సుమారు 500 మందికి పైగా దళితులను పోలీసు వాహనాల్లో తరలించగా, వీరందరిని సొంతపూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశారు.
రెండో విడత దళితబంధు నిధు లు విడుదల చేస్తామని చెప్పి, ఓట్లేయించుకున్న కాంగ్రెస్ పార్టీ మోసం చే సింది. ఇంత గొప్ప పథకం తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారని అర్థమవుతున్నది. దళితుల బతుకుల్లో వెలుగులు నింపిన కేసీఆర్ ఖ్యాతిని కనుమరుగు చేసేందుకే సీఎం రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నాడని మేం భావిస్తున్నాం. అందుకే మా ఖాతాల్లోని డబ్బులను ఫ్రీజ్ చేసిన్రు. ఇప్పటికైనా నిధులను వెంటనే విడుదల చేయాలె. లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి తగిన బుద్ధి చెబుతం.
– మోతె అర్జున్, జమ్మికుంట
అసెంబ్లీ ఎన్నికలకు మందు రేవంత్రెడ్డి దళితబంధు నిధులు పెంచుతామని చెప్పిండు. ఇప్పుడేమో ఈస్కీంను మొత్తమే ఎత్తేయాలని చూస్తున్నడు. ఇది సరైం ది కాదు. గత ప్రభుత్వం ఇప్పటికే మా ఖాతాల్లో రెండో విడత డబ్బులు వేసింది. కానీ, ఇప్పుడచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీజ్ చేయడం ఎందుకు. వెంట నే ఫ్రీజింగ్ను ఎత్తేసి నిరుపేద దళితులకు మేలు చేయాలి. లేదంటే ఓట్లకోసం వచ్చినప్పుడు తరిమికొడతం.
– మారపల్లి మహేందర్, కోమటిపల్లి (జమ్మికుంట)
శాంతియుతంగా ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లినం. కానీ, పోలీసులు దౌర్జన్యం చేసిన్రు. బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో ఎత్తిపడేసిన్రు. కాంగ్రెస్ ప్రభుత్వ అండతో నే మాపై దాడులు చేస్తున్రు. ఇది పద్ధతేనేనా..? కాంగ్రెస్ మీద మాకు నమ్మకముండె. ఇప్పుడా నమ్మకం పోయింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మెమెంతో కృషి చేసి నం. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి. లేదంటే పార్లమెంట్ ఎన్నికల్ల ఆ పార్టీని బొంద పెడుతం.
– జన్ని రవికుమార్, ఇల్లందకుంట (హుజూరాబాద్)
కలెక్టర్ మేడంకు మాబాధ చెప్పుకునేందుకు వత్తే, పోలీసులు మమ్ములను దొంగలకన్నా అధ్వాన్నంగా చూస్తున్నరు. గేటు కాడికి రాకముందే వ్యాన్లళ్లకు ఎక్కించిన్రు. బలవంతం గా కాళ్లు, చేతులు పట్టి ఇసిరేసిన్రు. సానమందికి దెబ్బలు తగిలినయ్. మాకు ఇదివరకు కేసీఆర్ సర్కారు సగం పైసలు ఇచ్చింది. మిగతా పైసలు ఇత్తే యూనిట్లను మరింత పెంచుకుందామనుకున్నం. కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ అన్యాయం జేత్తున్నది.
– కొత్తూరి అయిలమ్మ, ఇల్లందకుంట
దళితులను అరెస్ట్ చేయడం హేయనీయం. నియోజకవర్గంలో 2800 మంది లబ్ధిదారులకు రూ.ఐదు లక్షల దళితబంధు నిధులను విడుదల చేయాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లబ్ధిదారుల అకౌంట్లో 10 లక్షలు జమ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఫ్రీజ్ చేసింది. ఇప్పటికే దళితబంధు గురించి అసెంబ్లీలో ప్రస్తావించాం. అయినా కాంగ్రెస్ సర్కారు ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టడం బాధాకరం. కరీంనగర్ జిల్లాలో పెద్ద మంత్రినని చెప్పుకునే వ్యక్తి దళితులను అరెస్ట్ ఎందుకు చేయించారు? ఇదేనా ప్రజాపాలన? వెంటనే నిధులు ఇవ్వాలి. లేదంటే ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం.
– హూజూరాబాద్లో నల్లాచొక్క ధరించి నిరసన తెలిపిన అనంతరం ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి
ప్రజావాణిలో విజ్ఞప్తి చేసేందుకు కలెక్టరేట్కు వెళ్లిన దళితులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. కాంగ్రెస్ సర్కారు దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం. హుజూరాబాద్ నియోజకవర్గంలోని సుమారు 3వేల మంది లబ్ధిదారులకు రెండో విడుత దళితబంధు నిధులు ఇవ్వాల్సి ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేసింది. కానీ, రేవంత్ సర్కారు నగదును ఫ్రీజ్ చేసి దళితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. నిరుపేద దళిత కుటుంబాల్లో వెలుగులు నింపిన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి. ఇలాంటి మంచి పథకాన్ని ఆపడం మంచిది కాదు. రేవంత్రెడ్డి సరారు బీఆర్ఎస్పై ఉన్న కోపాన్ని దళితులపై చూపద్దు.
– హుజూరాబాద్లో విలేకరులతో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్