మానకొండూర్/ హుజూరాబాద్ రూరల్/ శంకరపట్నం/ ఇల్లందకుంట/ చొప్పదండి/ సైదాపూర్/ గన్నేరువరం/ కరీంనగర్ రూరల్/ తిమ్మాపూర్ రూరల్, మే 25: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్, వ్యవసాయ అధికారులు హెచ్చరించారు. శనివారం కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, హుజూరాబాద్, శంకరపట్నం, సైదాపూర్, గన్నేరువరం, తిమ్మాపూర్ మండలాల్లోని సీడ్ కంపెనీలు, ఫర్టిలైజర్ దుకాణాలు, డీసీఎంఎస్, సీఎస్సీ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేయాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే క్రిమినల్ కేసు నమోదుతో పాటు పీడీ యాక్టు అమలు చేస్తామని హెచ్చరించారు.
ఆయా చోట్ల తనిఖీల్లో హుజూరాబాద్ ఏడీఏ సునీత, మండల వ్యవసాయాధికారి వైదేహి, ఏఎస్ఐ మల్లారెడ్డి, ఏఈవో తిరునగరి నిఖిల్కుమార్, మానకొండూర్ సీఐ రాజ్కుమార్, ఏవో శ్రీనివాస్రెడ్డి, హుజూరాబాద్ ఏవో సునీల్కుమార్, ఏఈవో సతీశ్, కేశవపట్నం మండల వ్యవసాయాధికారి ఆర్ శ్రీనివాస్, ఎస్ఐ పీ లక్ష్మారెడ్డి, తిమ్మాపూర్ సీఐ స్వామి, గన్నేరువరం ఏవో కిరణ్మయి, ఎస్ఐ నరేశ్, ఇల్లందకుంట ఏఈవోలు రాకేశ్, తిరుపతి, మమత, సంపత్, వీణవంక ఎస్ఐ తిరుపతి, ఏవో గణేశ్, కరీంనగర్ రూరల్ ఎస్ఐ శేఖర్, వ్యవసాయ అధికారి బీ సత్యం, తిమ్మాపూర్ ఏవో సురేందర్, ఎస్ఐ చేరాలు, చొప్పదండి మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ పాల్గొన్నారు.