Pochamma Bonalu | చిగురుమామిడి, మార్చి 22 : చిగురుమామిడి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో మహిళలు నెత్తిన బోనాలతో పోచమ్మ వద్దకు బయలుదేరి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలతో మొక్కులు తీర్చుకున్నారు.
ఏడాదిలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. చిన్నారులు డప్పు చప్పులకు నృత్యాలు చేయగా మహిళలు బోనాలతో తరలి వెళ్లారు.
ఈ వేడుకల్లో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు గొల్లపల్లి సదాచారి, గొల్లపల్లి సత్యనారాయణ, చొప్పదండి సుధాకర్, గొల్లపల్లి తిరుపతి, వడ్లూరు కుమారస్వామి, గొల్లపల్లి సద్గుణ చారి, గొల్లపల్లి అరుణ, వల్లూరి నరేష్, గొల్లపల్లి సత్యం, గొల్లపల్లి శ్రీనివాస్, చొప్పదండి సదాచారి తదితరులు పాల్గొన్నారు.