పెగడపల్లి, జూన్ 19 : పెగడపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ మేర్గు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు ఇంటికో బోనంతో బైండ్లోళ్ల ఆటలు, శివసత్తుల నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్యన ఊరేగింపుగా ఆలయానికి వెళ్లారు.
అమ్మవారికి బోనం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ‘సల్లంగా చూడు పోచమ్మ తల్లీ’ అంటూ వేడుకున్నారు.