మల్యాల, జూలై 14 : హరితహారం, గ్రీన్ చాలెంజ్లో భాగంగా శనివారం మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగు ల కమలాకర్లతోపాటు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ శనివారం కొండగట్టుకు వస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం చొప్పదండి నియోజకవర్గ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రవిశంకర్ కొండగట్టుకు చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించడంతో పాటు ఆలయాన్ని దర్శించుకొని పరిశీలన జరిపాక మరో 500 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్ధగా ఉన్నామని తెలిపారని గుర్తు చేశారు. ఇందుకు పలు ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ సంతోష్కుమార్ కొండగట్టు ఆలయం చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటించారని, ఇందులో భాగంగా తన నిధుల నుంచి మొదటి విడుతగా గ్రీన్బడ్జెట్ కింద 1.04 కోట్లతో హరితహారం కార్యక్రమానికి అటవీశాఖ నేతృత్వంలో శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం కొండగట్టు క్షేత్రానికి మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తోపాటు ఎంపీ సంతోష్కుమార్ వస్తున్నట్లు చెప్పారు.
కొండగట్టు ప్రాంతంలోని 1095 ఎకరాల్లో ఏటా 200 ఎకరాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తామని తెలిపారు. వచ్చే 25వ తేదీలోగా సంతలోనిలొద్ది పంప్హౌస్ పనులకు శ్రీకారం చుడుతామని, ఆ తర్వాత రోడ్డు పనులకు ప్రా రంభోత్సవం చేస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా చొప్పదండి నియోజకవర్గ వ్యా ప్తంగా 1600 కోట్లతో పలు ప్రత్యేక పనులు చేపట్టామన్నారు. మంత్రుల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను నాయకులు, అధికారులతో కలసి పరిశీలించడంతోపాటూ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మల్యాల జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్రావు, సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మల్యాల మండల అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, సహకార సంఘం అధ్యక్షుడు ముత్యాల రాంలింగారెడ్డి, బోయినపల్లి మధుసూదన్రావు, మేన్నేని రాజనర్సింగరావు, సర్పంచ్లు గరికంటి మల్లేశం, దొంగ కరుణాకర్రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అల్లూరి రాజేశ్వర్రెడ్డి, కొండగట్టు ఆలయ డైరెక్టర్లు గుర్రం రాజేందర్రెడ్డి, ముద్దం కవిత-రవి, వొల్లాల లింగంగౌడ్, గన్ను శ్రీనివాసరెడ్డి, ఉప్పుల గంగయ్య, పోచమ్మల ప్రవీణ్, కొంక సర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య, కొంకటి లచ్చిరెడ్డి, అనుమండ్ల అజయ్, ఆసం శివకుమార్, మల్యాల గణేశ్ పాల్గొన్నారు.