కాంగ్రెస్కు ఓటేస్తే ఇక కరెంట్ పోయినట్లేనని, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతులు కరెంట్ కోసం కొట్లాడుతున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్కే ఓటు వేసి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే దేశంలోని అన్ని పార్టీలతో కొట్లాడి రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. వేములవాడ పట్టణంలోని 9వ వార్డులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి బుధవారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. – వేములవాడ, అక్టోబర్ 25
వేములవాడ, అక్టోబర్ 25: కాంగ్రెస్కు ఓటేస్తే ఇక కరెంటు కష్టాలు మళ్లీ మొదలైనట్లేనని, ప్రజలు ఆలోచించి 24 గంటలు కరెంటు ఇచ్చే బీఆర్ఎస్కే ఓటు వేసి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేద్దామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో రైతులు కరెంట్ కోసం కొట్లాడుతున్నారని తెలిపారు. వేములవాడ పట్టణంలోని 9వ వార్డులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి బుధవారం ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం పద్మశాలీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కూడా తెలంగాణ వస్తే విద్యుత్ కోతలు తప్పవని ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. వాటన్నింటిని అధిగమించడమే కాకుండా 24 గంటల కరెంటు, సాగునీరు అందించి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన నిలిచారని గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని, దేశంలోని అన్ని పార్టీల మద్దతుతో తాము కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నామని ఆనాటి రోజులను గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఉంటే 2006లోనే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 2009లో కూడా ఇచ్చినట్టే ఇచ్చి వెనకి తీసుకుందని వాపోయారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడారు.
రాజన్న ఆలయంతో పాటు వేములవాడ సర్వతోముఖాభివృద్ధి తాను పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకొని అభివృద్ధి చేసి చూపుతానని హామీ ఇచ్చారు. పట్టణం పరిధిలోని పేదలందరికీ ఇప్పటికే 1,200 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే రమేశ్ బాబు ప్రతిపాదించారని, వాటిని పూర్తి చేసి అందిస్తానని భరోసా ఇచ్చారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అందిస్తామని స్పష్టం చేశారు. కోనరావుపేట మండల బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని, ఆశీర్వదిస్తే అందుబాటులో ఉండి అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. అంతకుముందు బద్ది పోచమ్మ ఆలయం వద్ద అమ్మవారికి మొక్కారు. అకడి నుంచి పద్మశాలీ సంఘం వరకు దుకాణాల్లో తిరుగుతూ ప్రచారం చేశారు.
అలాగే విశాల షాపింగ్ యజమాని వేముల శ్రీనివాస్, సుమన్కు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచారంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పులం రాజు, గోసల రవి, కౌన్సిలర్లు మారం కుమార్, నిమ్మశెట్టి విజయ్, నీలం కళ్యాణి, సిరిగి రామ్చందర్, యాచమనేని శ్రీనివాస్రావు, బింగి మహేశ్, కో ఆప్షన్ సభ్యులు బాబున్, నాయకులు రామతీర్థపు రాజు, భాసర్ రావు, గూడూరి మధు, ముద్ర కోల వెంకటేశం, నీలం శేఖర్, కోయినేని శ్రీనివాస్, తీగల వెంకటేశ్వర్రావు, గజానందరావు, వెంగల శ్రీకాంత్, గోపు బాలరాజు, జడల శ్రీనివాస్, నరాల దేవేందర్, అక్రమ్ పాషా, చేపూరి రవి తదితరులు పాల్గొన్నారు.