చొప్పదండి, అక్టోబర్14: ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి, తన గెలుపునకు కృషి చేయాలని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని నివాసంలో శనివారం ఆయన చొప్పదండి మండలానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను ఆయా గ్రామాల్లో పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏదో ఒక రకంగా ప్రతి గడపకూ చేరాయని, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని కోరారు. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వివరించాలన్నారు.
ఈనెల 15న ప్రజలు మెచ్చేలా కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారని, ప్రజలందరూ గమనించాలని కోరారు. కేసీఆర్ విడుదల చేసే మేనిఫెస్టోను నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు. గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టోలోని హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వారి పాలిత రాష్ట్రాల్లో ఎకడా అమలు చేయని గ్యారెంటీ, వారెంటీలతో ప్రజల ముందుకు వస్తున్నారని, వారి కుట్రలను ప్రజలకు వివరించాలని నాయకులను, కార్యకర్తలను కోరారు.
ఓటు అడుగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ఈ గ్యారెంటీలు మీరు పాలించే రాష్ట్రాల్లో ఎకడ అమలు చేస్తున్నారో తెలుపాలని నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలు బీఆర్ఎస్ను మరోసారి ఆదరిస్తే రాష్ట్రంలో, నియోజకవర్గాల్లో ఊహించని అభివృద్ధి జరుగుతుందని, దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, సింగిల్ విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మారెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుకారెడ్డి, వైస్ చైర్మన్ రాజశేఖర్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్ , మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం ఇన్చార్జి బందారపు అజయ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గుంట రవి తదితరులు పాల్గొన్నారు.