Peddapally | పెద్దపల్లి రూరల్, జూన్ 20 : దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సమాచారం చేరవేస్తే తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి రూరల్ ఎస్సై బీ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాలలో గుర్తుతెలియని వ్యక్తులు పార్థి గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్ లకు చెందిన వ్యక్తులు తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు.
గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ గ్రామాలలో గస్తీ ఏర్పాటు చేసుకొని అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినట్లయితే 100కు ఫోన్ చేసి సమాచారం తెలపాలని సూచించారు. నాలుగు రోజుల క్రితం పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట, రాఘవాపూర్ గ్రామాల్లో జరిగిన దొంగతనాల విషయంలో అప్రమత్తత చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. పోలీసు పెట్రోలింగ్ కూడా చేస్తున్నామని, ఎలాంటి అనుమానాస్పద సమాచారం తెలిసినా, వ్యక్తులు కనిపించినా తమకు సమాచారం అందించాలని సూచించారు.