Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 5 : స్వాతంత్ర్య సమరయోధులు, భారత దేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జాతికి అందించిన సేవలను గోదావరిఖని లోని 11వ డివిజన్ బస్తీ ప్రజలు స్మరించుకున్నారు. ఈ మేరకు 11వ డివిజన్ సంజయ్ నగర్ బస్తీ పెద్దలు బూడిద రమేష్, మారపల్లి రవి కుమార్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఆదివారం పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా 11వ డివిజన్ ఐక్య వేదిక అధ్యక్షుడు లంక సురేష్ మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా బాబు జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. రక్షణ, వ్యవసాయ, కార్మిక శాఖలకు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వర్తించి, స్వాతంత్రం అనంతరం స్వయంపాలనలో దేశ ప్రగతికోసం ఆయన తన వంతు కృషి చేశారని కేసీఆర్ వెల్లడించారు.
అందరూ చదువులో ఎదగాలి, అందరూ చదువుకోవాలని కోరుకునే ఎంతో మందికి తోడ్పాటు అందించే వ్యక్తిగా మన జాతిలో ఉండడం గర్వకరణం అని కొనియాడారు. కార్యక్రమంలో బస్తీ పెద్దలు జీడి కుమార్, లంక సదానందం, మాతంగి కనకరాజు, గడ్డం రమేష్, గంగారపు మల్లయ్య, అడ్డూరు రాములు, ప్రకాష్, ఓదెలు బస్తి పెద్దలు పాల్గొన్నారు.