రాష్ట్రంలో బీజేపీపై ఉన్న తీవ్ర మైన వ్యతిరేకతకు, తిరస్కార భావానికి ఈ ఎన్నికలు నిదర్శనం. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారు. అడ్డదారుల్లో గెలుపు కోసం బీజేపీ చేసిన కుటిల ప్రయత్నాలన్నింటినీ ప్రజలు ఓటుతో తిప్పికొట్టారు. సెస్ ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా మార్చి, విచ్చలవిడిగా డబ్బు, ప్రలోభాలతో ప్రజలను మభ్య పెట్టాలనుకున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. సెస్ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు, నాయకులకు నా ధన్యవాదాలు. ఈ విజయంతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై, ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగింది. ఈ గెలుపుతో ఉప్పొంగిపోకుండా సెస్ పరిధిలో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలపై దృష్టి సారిస్తాం.
– బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ) : తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారని బీ ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించడంపై ఆయన స్పందించారు. ఈ మేరకు సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ విజయం తమపై మరింత బాధ్యత పెంచిందన్నారు. బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా సెస్ ఎన్నికల్లో గెలువలేక పోయిందన్నారు. సాధారణ ఎన్నికల మాదిరి అనేక ప్రయత్నాలు చేసిందని, ఆపార్టీ చేసిన కుటిల ప్రయత్నాలను ప్రజలు నిర్దందంగా తిరస్కరించి, తమ ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పారని తెలిపారు.
విద్యుత్ సంస్కరణల పేరిట విద్యుత్ రంగాన్ని సంపూర్ణంగా ప్రైవేటీకరించి, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రలకు ఇదొక గుణపాఠంగా మారుతుందని హెచ్చరించారు. బీజేపీ విద్యుత్ సంస్కరణల పేరుతో చేస్తున్న కుట్రలపై ప్రజలకు సైతం సంపూర్ణ అవగాహన ఉన్నందునే ఆపార్టీకి సరైన గుణపాఠం చెప్పారని విమర్శించారు. సెస్ ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపిస్తే మోటర్లకు మీటర్లు వస్తాయని, ఉచిత విద్యుత్ సౌకర్యం ఉండదని ప్రజలు భావించారని, అందుకే చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. సెస్ ఎన్నికల్లో గెలిచేందుకు భారీ ఎత్తున డబ్బులు వెద జల్లిందని, అనేక ప్రలోభాలకు తెరలేపినా ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే నిలిచి సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం బీజేపీపై నెలకొన్న తీవ్రమైన వ్యతిరేకతను, తిరస్కారాన్ని స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రజలు అనేక ఎన్నికలో ఓడిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లా ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు
సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘనవిజయం కట్టబెట్టిన జిల్లా ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, సహకరించిన ప్రతిఒక్కరికీ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై తెలంగా ణ ప్రజలకు ఉన్న అపూర్వమైన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమన్నారు. తమ ప్రభుత్వం రైతన్నలు, నేతన్నలు, దళిత, గిరిజనులకు, కులవృత్తులకు అందిస్తున్న విద్యుత్ సంక్షేమ కా ర్యక్రమాలకు సెస్ గెలుపు జనామోదమని వ్యాఖ్యానించారు.
ఈ విజయంతో బీఆర్ఎస్ నాయకత్వంపై, ప్రభుత్వంపై మరిం త బాధ్యత పెరిగిందన్నారు. ఈ గెలుపుతో ఉప్పొంగిపోకుండా సెస్ పరిధిలో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా, మౌలిక వ సతుల కల్పన వంటి కార్యక్రమాలపై దృష్టి సారిస్తామన్నారు. వి ద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షే మ ం, అభివృద్ధి అనే అంశాలతో సంతులిత విధానానికి ప్రజల నుం చి దక్కిన ఆమోదంగా భావిస్తున్నానన్నారు.
ఒకవైపు రైతు లు, కులవృత్తులకు, దళిత, గిరిజనులకు రాయితీలు ఇస్తూ మరోవైపు అన్నిరంగాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భారీగా మౌలిక వసతుల కల్పన,విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్న తమ విధానాలను ప్రజలు బలపరిచారని తెలిపారు.
మరిన్ని మెరుగైన సేవలందిస్తాం
సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించిన వినియోగదారులందరికీ మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తాం. బాధ్యతను మరింత పెంచిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సెస్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాం. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన జిల్లా ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు నా కృతజ్ఞతలు. బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఓటర్లు అండగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సందర్భంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి సంపూర్ణ సహకారాన్ని తీసుకుని సెస్ను ఆర్థికంగా బలోపేతం చేశా.
– ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్
కష్టపడ్డ వారందరికీ కృతజ్ఞతలు
బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకూ నా కృతజ్ఞతలు. సెస్ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో ఇతర జిల్లాల నుంచి, నియోజక వర్గాల నుంచి ఇన్చార్జిలను దించి ప్రలోభ పెట్టినా ఎక్కడా ఓటర్లకు బీఆర్ఎస్ విశ్వాసం పోలేదనేది నిరూపితమైంది. బండి సంజయ్ ప్రలోభ పెట్టాలని చూసిన పార్టీపై ఉన్న నమ్మకంతో ఓటు వేసి గెలిపించినందుకు వారికి రుణపడి ఉంటాం. ఈ గెలుపు మా అభ్యర్థుల బాధ్యతను కూడా పెంచింది. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవిందర్రావు, టీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు చీటి నర్సింగారావు, చైర్మన్ గూడూరి ప్రవీణ్ గెలుపొందిన అభ్యర్థులను అభినందించారు.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
ప్రజలే మా బలం
ప్రజలే మా బలం. ఇల్లంతకుంట బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లుగారి రవీందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ఈ విజయం అంకితం. ఒక రైతు బిడ్డకు, ఉద్యమకారుడు, నిస్వార్థ పరుడైన రవీందర్ రెడ్డిని గెలిపించిన ప్రతి ఒటరుకూ రుణపడి ఉంటా. ‘మానకొండూర్ గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా.. రసమయి బాలకిషన్ కంచుకోట’ అని మరోసారి నిరూపించిన ప్రజలకు నిరంతరం అండగా ఉంటా. మండల అభివృద్ధికి కృషి చేస్తా. ఎంత మంది ఏకమైనా బీఆర్ఎస్కు సాటి మరెవరూ లేరని నిరూపించిన ప్రజలు, అభ్యర్థి విజయానికి అనునిత్యం కృషిచేసిన శ్రేణులకు కృతజ్ఞతలు.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే