పెద్దపల్లి, జూలై 18 (నమస్తే తెలంగాణ): ‘ప్రతి పేద కుటుంబానికి మేలు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు పనిచేస్తున్నది. ప్రభుత్వ ప్రాధామ్యాలే నా ప్రథమ లక్ష్యం. నేను మొదటిసారి సిద్దిపేటలో అదనపు కలెక్టర్గా పనిచేశా. ఆ అనుభవం ఎంతో నేర్పింది. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తా. ఎవరికీ ఏ సమస్య ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకరావచ్చు. అందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతా. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు, జిల్లాపై పట్టు సాధించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తా’ అని పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఆయన, మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలు వెల్లడించారు.
నమస్తే తెలంగాణ: కలెక్టర్గా పెద్దపల్లి జిల్లాకు వచ్చారు? ఎలా అనిపిస్తున్నది?
కలెక్టర్ : మాది హైదరాబాద్. నేను ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సిద్ధిపేట అదనపు కలెక్టర్గా త్రీ ఇయర్స్ నైన్ మంథ్స్ పనిచేశా. కలెక్టర్గా నాకు మొదటి పోస్టింగ్ పెద్దపల్లి. ఈ జిల్లాకు రావడం సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజలతో ఈజీగా కనెక్ట్ కావచ్చు. ఎనీటైం అందుబాటులో ఉంటా. ప్రజలు ఏ సమస్య ఉన్నా నేరుగా నన్ను సంప్రదించవచ్చు.
నమస్తే : జిల్లాలో ఏ అంశాలకు ప్రాధాన్యమివ్వనున్నారు?
కలెక్టర్ : పేదల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభు త్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ప్రజాప్రతినిధులు పాలసీలను చేస్తారు. వాటి అమలులో నేను ముం దుంటా. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య, వైద్యాన్ని చేరువ చేయాలి. గ్రామాల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటా. విద్యాశాఖ పథకాలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తా. తొలిమెట్టు, మధ్యాహ్నభోజనం, తదితర అంశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తా. ముఖ్యంగా సిద్దిపేటలో ‘పేస్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాం. వేసవి సెలవుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు మెరుగైన బోధన కోసం శిక్షణనివ్వడం ఈ కార్యక్రమ ఉద్దే శం. అదే కార్యక్రమాన్ని జిల్లాలో సైతం అమలు చేసి సత్ఫలితాలు సాధించేలా కృషిచేస్తా.
నమస్తే: స్వచ్ఛభారత్లో జిల్లాను ఎలా ముందుకు తీసుకెళ్తారు?
స్వచ్ఛభారత్ కింద సిద్దిపేట తర్వాత పెద్దపల్లి సైతం అనేక అవార్డులు సాధించింది. గతంలో పనిచేసిన అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. నేను అదే ఒరవడిని కొనసాగిస్తూ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో మరిన్ని అవార్డులు సాధించేలా కృషి చేస్తా.
నమస్తే: సిజేరియన్లు ఎలా తగ్గిస్తారు?
నేను సిద్దిపేటలో పనిచేసినప్పుడు అక్కడ మంత్రి హరీశ్రావుతో కలిసి పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. ఈ క్రమంలో సిజేరియన్లు చాలా వరకూ తగ్గించాం. ఇక్కడ సైతం వైద్యు లతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం.
నమస్తే: మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్?
కలెక్టర్ : మాది హైదరాబాద్ బేస్డ్ ఫ్యామిలీ. తాత ఐఏఎస్, నాన్న ఏకే ఖాన్ ఐపీఎస్, అమ్మ టీచర్. అన్న, నేను అంతా హైదరాబాద్ కేంద్రం గా ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాం. నాన్న ఐపీఎస్ కావడంతో పదోతరగతి పూర్తి చేసేలోపే 12స్కూళ్లు మారా. బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేష న్ పూర్తి చేశాక సివిల్స్ వైపు వెళ్లా. ఫోర్త్ అటెంప్ట్లో ఐఏఎస్గా సాధించా. అమ్మనాన్నల స్ఫూర్తితోనే ఐఏఎస్ సాధించా. వారి ప్రేరణతోనే ప్రజలకు సే వ చేయాలంటే సివిల్స్ బెస్ట్ ఆప్షన్ అనిపించింది.
నమస్తే : మీ పెళ్లి గురించి చెబుతారా..?
కలెక్టర్ : మా ఆవిడ హమ్నామారియం ఖాన్. ఆమె ఐఎఫ్ఎస్ అధికారి. మలయాళీ కుటుంబం. మాఇద్ద రికి ట్రైనింగ్లో పరిచయం. తర్వాత పెద్దల సమక్షం లో వివాహం చేసుకున్నాం. మా ఆవిడ ఢిల్లీ కేం ద్రం గా ఫారెన్ సర్వీస్లో యూఎన్వోలో పనిచేస్తున్నది.
నమస్తే: మీ హాబీస్ ఏంటి?
నాకు సమయం దొరికితే గిటార్ ప్లే చేస్తా. ఖాళీ సమయంలో పుస్తక పఠనమంటే మరింత ఇష్టం. రన్నింగ్ చేస్తా.
నమస్తే: కొత్తగా సివిల్స్ రాసేవారికి మీరిచ్చే సలహా?
సివిల్స్ కోసం నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. ప్రభుత్వం అనేక రకాలుగా శిక్షణలు ఇస్తున్నది. వాటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలి. ప్రిపరేషన్ అయ్యే అభ్యర్ధులు ఎందుకు చదువుతున్నాం? ఏం చదువుతున్నాం? అనేది ముందు తెలుసుకోవాలి. అప్పుడు మన దృష్టి మరలకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.