పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంథని ఆర్టీసీ బస్టాండ్లో బండారి సారక్క(52) అనే మహిళ ఆకస్మికంగా మృతి చెందింది. ముత్తారం మండలం ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన సారక్క వైద్యం కోసం కరీంనగర్కు వెళుతుండగా మంథని బస్టాండ్ లో అకస్మాత్తుగా మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.