కాల్వ శ్రీరాంపూర్ మార్చి 26 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లిలో(Parupalli) బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు టీకాలు వేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి హాజరై మాట్లాడారు.
మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువుల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్, ఎఎంసీ వైస్ చైర్మన్ రాజమల్లు, డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | సరూర్ నగర్లో ప్రేయసిని చంపేసిన పూజారికి జీవిత ఖైదు
Devara Movie | జపాన్లో ‘దేవర’ ప్రమోషన్స్.. అభిమానులతో వీడియో పంచుకున్న తారక్
BJP | నకిలీకి కేరాఫ్ బీజేపీ.. అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న టాప్-10 ఇండియన్ ఇన్ఫ్లూయెన్సర్లు