పెద్దపల్లి : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.పెద్దపల్లి మండలంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువుల్లో గురువారం చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందజేస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
సీఎం కేసీఆర్ పాలనలో మత్య్సకారులకు పూర్వవైభవం వచ్చిందన్నారు.
కార్యక్రమంలో ఎఫ్డీవో ఇంతియాజ్ హైమద్, ఎంపీపీ బండారి స్రవంతి, వైస్ ఎంపీపీ రాజయ్య, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.