ఆఖరి మజిలీని గౌరవంగా, ఆహ్లాద వాతావరణంలో జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ఈ క్రమంలో నాడు డంపింగ్ యార్డును తలపించిన శ్మశానవాటికలు నేడు ఉద్యానవనాలను తలపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 3.71 కోట్లతో పలు చోట్ల నిర్మిస్తుండగా, 4 శ్మశాన వాటికలను మోడ్రన్గా తీర్చిదిద్దేందుకు బల్దియా యంత్రాంగం కృషి చేస్తున్నది. ఇప్పటికే కిషన్ బాగ్ హిందూ స్మశాన వాటిక పూర్తి కాగా, మిగిలిన వాటిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.
పెద్దపల్లి, జూన్ 27: నాడు డంప్ యార్డును తలపించిన శ్మశానవాటికలు, నేడు కాంపౌండ్ వాల్ నిర్మాణం, బర్నింగ్ యూనిట్స్, ఆఫీస్రూ మ్, ఆర్చరీ, జంక్షన్, క్షౌరశాల గదులు, హైమా స్ట్ లైట్లు, గ్యాలరీ, గ్రీనరీ ఏర్పాటుతో ముస్తాబవుతున్నాయి. బతికున్నప్పుడే కాదు, చనిపోయాక కూడా గౌరవంగా అంతిమ సంస్కారా లు నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ మదిలో మెదిలిన ఆలోచనతో వైకుంఠధామాలు అద్భుతంగా తయారయ్యాయి. వైకుంఠధామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం.. ఎటు చూసినా పచ్చదనం ఉట్టిపడుతున్నది. శ్మశాన వాటిక మధ్యలో శివుని విగ్రహం, దహన సంస్కార సమయంలో కూర్చునేందుకు మోడ్రన్ గ్యాలరీల నిర్మాణం, కర్మలలో భాగంగా ప్రత్యేకంగా క్షౌరశాల గదులు ఏర్పాటు, అందులో కుర్చీలు, అద్దాలు ఏర్పాటు చేసింది. పెద్దపల్లి పట్టణంలో అన్ని శ్మశానవాటికల్లో కనీస మౌలిక వసతులు కల్పిస్తూ 4 శ్మశాన వాటికలను మోడ్రన్ తీర్చిదిద్దేందుకు పెద్దపల్లి బల్దియా పాలక వర్గం, అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. కిషన్ బాగ్ హిందూ శ్మశాన వాటిక పూర్తి కాగా, మిగిలిన వాటిలో పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఆఖరి మజిలీకి అన్ని ఏర్పాట్లు
పెద్దపల్లి పట్టణంలోని ఉన్న పలు శ్మశాన వాటికల్లో సకల వసతులు కల్పిస్తూ, వైకుంఠ రథాన్ని అందుబాటులో ఉంచారు. 3. 71 కోట్లు వెచ్చించి శ్మశానవాటికల్లో బర్నింగ్ యూనిట్స్, గ్యాలరీ, పూజ మండపం, టాయిలెట్స్, రన్నింగ్ వాటర్, ఆఫీస్ రూం. గ్రీనరీ, హైమాస్ట్ లైట్లు, కుర్చీలు, కంపౌండ్వాల్ నిర్మిస్తున్నారు. బంధంపల్లి శ్మశాన వాటికకు స్పెషల్ ఫండ్ నుంచి కోటి కేటాయించి చేస్తున్న అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. పద్మశాలీ వైకుంఠధామానికి రూ. కోటి కేటాయించారు. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముస్లిం శ్మశాన వాటిక (కిషన్బాగ్)19.60 లక్షలు (అందులో గుసూల్ ఖాన నిర్మాణం 15 లక్షలు, కంపౌండ్ వాల్కు 4.60 లక్షలు), వైశ్య సంఘం శ్మశానవాటిక కంపౌండ్ వాల్కు 6.30 లక్షలు, రజక సంఘం శ్మశానవాటిక కంపౌండ్ వాల్కు 4.80 లక్షలు, గౌడ్ సంఘం శ్మశాన వాటికకు 29.01 లక్షలు, రజక సంఘం శ్మశానవాటికలో టాయిలెట్ రూమ్స్, ఆఫీస్ రూమ్, పాథ్వేస్. ఆర్చీ, జంక్షన్ నిర్మాణానికి 33. 78 లక్షలు, తెనుగువాడ వైకుంఠధామానికి 21 లక్షలు, కూనారం రోడ్ శ్మశానవాటికకు 30 లక్షలు, కిషన్బాగ్ వైకుంఠధామానికి 16.87 లక్షలు, శాంతినగర్ శ్మశాన వాటిక కు 9. 34 లక్షలు కేటాయించగా, పనులు పురోగతిలో ఉన్నాయి.
రెండు నెలల్లో పనులు పూర్తి
పట్టణంలోని శ్మశానవాటికల్లో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. వాటిలో బర్నింగ్ యూనిట్స్, గ్యాలరీ, పూజ మండపం, టాయిలెట్స్.. రన్నిం గ్ వాటర్, ఆఫీస్ రూం, గ్రీనరీ, హైమాస్ట్ లైట్లు, కుర్చీలు, కంపౌండ్వాల్ నిర్మాణం చేయిస్తున్నాం. అంతి మ యాత్ర గానూ వైకుంఠరథాన్ని అందుబాటులో ఉంచాం. రానున్న రెండు నెలల్లో అన్ని శ్మశానవాటికల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం.
– మట్ట శ్రీనివాస్రెడ్డి, బల్దియా కమిషనర్ (పెద్దపల్లి)
రూపు రేఖలు మారాయి
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నాడు పెద్దపల్లి పట్టణంలోని శ్మశానవాటికలు డంపింగ్ యార్డును తలపించేవి. కానీ నేడు అందుకు భిన్నంగా మారాయి. పార్కులను తలపిస్తున్నాయి. పెద్దపల్లి పట్టణంలో శ్మశానవాటికల్లో అన్ని వసతులు కల్పించేందుకు 3. 71 కోట్లు కేటాయించాం. పనులు శరవేగంగా సాగుతున్నాయి. కిషన్బాగ్ హిందూ శ్మశానవాటికలో పనులు పూర్తయ్యాయి.
– డాక్టర్ దాసరి మమతారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ (పెద్దపల్లి)