Peddapally DCP Karunakar | ఓదెల, మే 30 : గంజాయి సరఫరా, మత్తు పదార్థాల సరఫరాను నిరంతరం నిఘా పెట్టి నియంత్రించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పొత్కపల్లి పోలీసులను ఆదేశించారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, వివిధ కేసులలో సిజ్ చేసిన వాహనాలను పరిశీలించారు.
అనంతరం రిసెప్షన్ సిబ్బందిని ఫిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను ఎస్ఐ దీకొండ రమేష్ ను అడిగి తెలుసుకున్నారు.
అలాగే స్టేషన్ పరిధిలో అత్యధికంగా నమోదవుతున్న నేరాలు, వాటి పురోగతి, సమస్యత్మక గ్రామాల, సరిహద్దు ప్రాంత వివరాలు, రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్వారిగా బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను డీసీపీ తెలుసుకున్నారు.
గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి అక్రమ రవాణా, సరఫరా, నిల్వ, సేవించే వారిపై స్టేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణ కోసం నిరంతరం పనిచేయాలని, నేరాల నియంత్రణకై విజుబుల్ పోలీసింగ్ అవసరమని, నిరంతం పోలీసులు పెట్రొలింగ్ నిర్వహించాలని సూచించారు. అనంతరం డీసీపీ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఏసీపీ జీ కృష్ణ, ఏఎస్ఐ వీరస్వామి గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.