పెద్దపల్లి : పండుగపూట విషాదం చోటు చేసుకుంది. ఓ బాలుడు స్నానానికి వెళ్లి బొక్కల వాగు గుంతలో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్పేట గొల్లవాడకు చెందిన ఎరవేన ముఖేష్ ( 13) స్నానం కోసం బొక్కల వాగులోకి వెళ్లాడు. కాగా, వాగులో చెక్ డ్యాం కోసం తీసిన గుంతలో పడి ముఖేష్ మృతి చెందాడు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, గుంతల వద్ద రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ముఖేష్ మృతి చెందాడని, కుటుంబ సభ్యుల, బంధువుల ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.