మంథని, జూన్ 22: రాష్ట్ర సాధన పోరులో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని బొకలవాగు వంతెనపై అమరవీరుల స్మారక స్థూప నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, జిల్లా ఆదనపు కలెక్టర్ కుమార్దీపక్తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మధూకర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున సాగిన ఉద్యమంలో ఎందరో యువకులు బలిదానాలు చేసుకున్నారని చెప్పారు. వారి త్యాగాల పునాదులపైనే తెలంగాణ సిద్ధించిందన్నారు. అమరులైన కుటుంబాలను, ఉద్యమకారులను గౌరవించడంతో పాటు వారి కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
అమరుల స్మారకంగా హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక స్థూపాన్ని సైతం సీఎం కేసీఆర్ ఆవిషరించారన్నారు. వారి త్యాగాలకు గురుతుగా నియోజకవర్గంలోనూ స్తూపాలను నిర్మిస్తామని చెప్పారు. ఆనంతరం పలువురు ఉద్యమకారులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలతా శంకర్లాల్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ఎక్కటి ఆనంతరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు వీకే. రవి, నక్క నాగేంద్ర శంకర్, కొట్టే పద్మ రమేష్లతో పాటు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.