Street Dogs | పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో మూడేళ్ల చిన్నారిని కుక్కలు పీక్కుతిన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం కాట్నపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నది. ఆ కుటుంబానికి చెందిన చిన్నారి దివ్య బెహ్రా (3) సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడికి దిగాయి. చిన్నారిని నోట కరుచుకుని పొలాల్లోకి లాక్కెళ్లాయి. అక్కడ చిన్నారిని పీక్కుతిన్నాయి. దీంతో చిన్నారి మరణించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.