పెద్దపల్లి : భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పీడిత వర్గాల అభ్యున్నతి పోరాడారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు.పెద్దపల్లి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ,కలెక్టరేట్ సిబ్బంది,జిల్లా అధికారులు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.