పెద్దపల్లి : రక్కాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికులంటే సీఎం కేసీఆర్కు అమితమైన అభిమానం అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అదివారం రామగుండం రీజీయన్ -1 పరిధిలోని ఓసీపీ- 3 కృషి భవన్ వద్ద కార్మికులకు ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి.. నూతన క్యాలెండర్లు కార్మికులకు అందించారు.
అనంతరం రామగుండానికి మెడికల్ కళాశాల మాంజూరు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి
ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం సింగరేణి కార్మికుల
సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. గత పాలకులు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి గని కార్మికుల వారసులకు కారుణ్య నియమాకాల ద్వారా తిరిగి కల్పించిన
కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ అన్నారు.
గని కార్మికుల కావాల్సిన సకల సౌకర్యాలు అందించి వారిని కడుపులో పెట్టి కాపాడుకుంటున్నారని తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
కార్యక్రమంలో టబీజీకేఎస్ నాయకులు అయిలి శ్రీనివాస్, జహీద్ పాషా, కార్పొరేటర్ శంకర్ నాయక్, నాయకులు రావుల భానకర్, బేతి చంద్రయ్య, ఎట్టం కృష్ణ, ఇనుముల సత్యం, పులి రాకేష్, పోలాడి శ్రీనివాసరావు, ఆకుల రాజయ్య, సంధ్యారెడ్డి, సూర్య, శ్యాం తదితరులు పాల్గొన్నారు.