పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం (Ramagundam) లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు దుర్మరణం చెందారు. వెనుక నుంచి వచ్చిన లారీ ద్విచక్రవాహానాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రామగుండం సబ్ ట్రెజరీ (Treasury ) కార్యాలయంలో సబార్డినేటర్ గా పని చేస్తున్న మహ్మద్ అబ్దుల్ ఖదీర్ (54) ద్విచక్రవాహనంపై విధులకు బయలు దేరాడు.
బసంత్ నగర్ టోల్ గేట్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొనగా వెనుక నుంచి వచ్చిన మరో లారీ ( Lorry) ద్విచక్ర వాహానాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఖదీర్ కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రుడిని బసంత్ నగర్ పోలీసులు 108 లో పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.