పెద్దపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాని వ్యతిరేకిస్తూ 28న గనుల వద్ద నిరసన కార్యక్రమం చేపడుతామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు స్పష్టం చేశారు.
బుధవారం పెద్దపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రతి కార్మికుడు ఐక్యంగా ఉద్యమించి బీజేపీ ప్రజా వ్యతిరేక విధాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే నవంబర్ 1న జీఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 30న జరిగే హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.