పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ నవ వధువు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన పాలకుర్తి మండలం కుక్కలగూడూర్లో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నవ వధువు మేడం అనూష(21) అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అనూష మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.