పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మున్సిపల్ కార్యాలయం వద్ద ద్విచక్రవాహనంపైకి ఒక లారీ మృత్యువులా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి సహా తల్లి మృతిచెందింది. తండ్రికి గాయాలయ్యాయి. మృతులు ఎన్టీపీసీకి చెందిన ఉప్పాల రమ్య ( 26), నిర్ణయ చంద్ర ( 4 నెలలు) గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన నిర్వేశ్ చంద్రను ఆస్పత్రికి తరలించారు.